మళ్లీ గెలిపిస్తే.. మోడీ ఆ టార్గెట్ అందుకుంటారా?
దిల్లీలోని భారత్ మండపంలో రెండ్రోజులు పాటు జాతీయ మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని 65 నిమిషాల పాటు ప్రసంగించారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాబోయే కాలంలో సాధించాల్సిన లక్ష్యాలను ఆవిష్కరించారు. దేశాభివృద్ధిలో వచ్చే అయిదేళ్లలో అత్యంత కీలకపాత్ర.ఆ వ్యవధిలో ఇదివరకటి కంటే చాలా వేగంగా పనిచేయాలి.
వచ్చే వంద రోజుల్లో బీజేపీ కార్యకర్తలు నూతనోత్సాహంతో శ్రమించాలి. ప్రతి కొత్త ఓటరును ప్రతి వర్గాన్ని, ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందిన ప్రతి ఒక్కరిని చేరుకోవాలి. వారి విశ్వాసాన్ని పొందాలి. అందరూ కలిసి ప్రయత్నిస్తే అత్యధిక సీట్లు బీజేపీకే దక్కుతాయి. పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి కల్పించడం సాధారణ విషయమేమీ కాదు.
మేం రాజకీయాల కోసం కాకుండా దేశం కోసం పనిచేస్తున్నాం. బీజేపీ సర్కారు రావాలని నేను చెబుతోంది అధికారాన్ని అనుభవించడం కోసం కాదు. ప్రజల కోసమే. నేను నా ఇంటి గురించి ఆలోచించి ఉంటే కోట్ల మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చే వాళ్లం కాదు. యువత, మహిళలు, పేదల కలల సాకారం కోసం రాత్రింబవళ్లు పనిచేశాం. ఎన్నో సమస్యలు పరిష్కరించాం. దేశం లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థకు మారేందుకు దాదాపు 60 ఏళ్లు పట్టింది. గత పదేళ్లలోనే అది మూడు లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్నఆర్థిక వ్యవస్థను అయిదో స్థానానికి చేర్చాం. ఇది మూడో స్థానానికి ఎగబాకితే భారత్ లో ఊహించలేని అభివృద్ధి జరుగుతుంది అని వివరించారు.