ఫస్ట్ టైం ఎన్నికలలో ఓటమి పై మాట్లాడిన కేసీఆర్..!!
కచ్చితంగా కరీంనగర్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చాలా ధీమాని వ్యక్తం చేశారు.. కొద్ది రోజులలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుందని రైతులు రోడ్లు ఎక్కుతున్నారని బిఆర్ఎస్ పార్టీతోనే మేలు జరుగుతుందని చర్చలు ప్రజలలో మొదలయ్యాయని శాసనసభ ఎన్నికల ఫలితాలను నేతలు అసలు పట్టించుకోవద్దని ఎంపీ ఎన్నికలలో కలిసి పోటీ చేయాలని సూచించారు.. ఈ సభ తర్వాత బస్సు యాత్ర చేస్తామని కూడా తెలియజేశారు.
లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ బిజెపి పార్టీల మధ్య గట్టి పోటీ ఉందని వచ్చేవారం కరీంనగర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు కూడా చేస్తామని వెల్లడించారు. మండల స్థాయిలో నేతలు పార్టీలు సమావేశం హాజరుకావాలని తెలియజేశారు..LRS ను గతంలో ప్రకటిస్తే ప్రజల రక్తం పీల్చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు చాలా రాద్దాంతం చేశారు. ఇప్పుడు అదే LRS ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ప్రకటించింది అంటూ కేసిఆర్ ప్రశ్నించారు..కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు చాలానే ఉన్నాయని ..వాళ్ల కుంపాటి వాళ్లు సర్దుకోవడానికి సమయం సరిపోలేదంటూ వెల్లడించారు ప్రజలకు కొద్ది రోజులలోనే మనం కచ్చితంగా గుర్తుకు వస్తామంటూ కేసీఆర్ వెల్లడించారు .