అయోధ్య ప్రాణప్రతిష్ట రోజు.. చైనా, పాక్ కుట్ర చేశాయా?
ఈ వార్త ఆ రెండు రోజులు సంచలనంగా మారింది. అయితే సైబర్ ముప్పును ముందే పసిగట్టిన మన సైబర్ సెక్యూరిటీ సంస్థ వాటిని ఎప్పటికప్పుడు గుర్తించి తిప్పికొట్టడంలో సఫలీకృతం అయ్యారు. జనవరి 22న అయోధ్య ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సమయంలో మనమంతా భక్తితో పరవశించి పోతుంటే.. మన దేశంలోని ముఖ్యమైన వెబ్ సైట్లపై దాడి చేసేందుకు పాక్, చైనాకు సంబంధించిన హ్యాకర్లు ప్రయత్నించారు.
ఈ హ్యాకర్లు రామ మందిర్, ప్రసార భారతి తో పాటు ఇతర వైబ్ సైట్లను హ్యాక్ చేసేందుకు యత్నించారు. ఇందులో దాదాపు 140 వెబ్ సైట్లు ఆ రోజు రామ మందిర ప్రసారాన్ని ప్రత్యక్ష ప్రసారం అందిస్తున్న ప్రసార భారతిని హ్యాక్ చేయబోయారు. ఇందులో చైనావే 999 ఉండగా.. మిగతా 245 పాకిస్థాన్ కి సంబంధించిన హ్యాకర్లు. జీ-20 సదస్సుల సమావేశాల్లోను ఇలానే చేయబోయారు. మనం సంతోషంగా ఉత్సాహం. సదస్సులు నిర్వహించుకుంటుంటే వాటిని ఆపేందుకు యత్నించి.. భారత్ పై ఎంత ద్వేషంతో ఉన్నాయో చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలంటున్నారు విశ్లేషకులు.