టీడీపీ,జనసేన,బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయంటే?

Purushottham Vinay
జనసేన పార్టీ 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పినప్పటికీ.. వాటిల్లో మూడు స్థానాలను బీజేపీకి త్యాగం చేసింది జనసేన. ఇక ఉండవల్లి చంద్రబాబు నాయుడు నివాసంలో సుమారు 8 గంటల పాటు చర్చించిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ జాతీయ నేత బైజయంత్ సీట్ల సర్దుబాటుపైన ఏకాభిప్రాయానికి వచ్చారు. మూడు పార్టీల ఉమ్మడి ప్రకటనను అటు చంద్రబాబు నాయుడు, ఇటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ విడుదల చేశారు.ఒకవైపు పొత్తు ఫిక్స్‌ అయ్యి సీట్ల సర్ధుబాటు కొలిక్కిరావడంతో విజయవాడలో కేంద్ర మంత్రి షెకావత్ తో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి భేటీ అయ్యారు. సీట్లు ఇంకా అభ్యర్థుల ఎంపికపై గంటన్నర పాటు చర్చించారు. ఈ చర్చల సారాంశాన్ని ఢిల్లీ పెద్దలకు కేంద్ర మంత్రి షెకావత్ వివరిస్తారని తెలిపారు పురంధేశ్వరి. అలాగే రాష్ట్రపార్టీ నివేదికను కూడా ఇప్పటికే అందజేశామన్నారు. ఈ సీట్లపై కేంద్ర పెద్దలు ప్రకటన చేస్తారు.. ఇంకో రెండు మూడు రోజుల్లో ఉమ్మడి పార్టీల ప్రకటన ఉంటుందన్నారు పురంధేశ్వరి..



ఈ సీట్లతో పాటు పోటీచేసే స్థానాలపై కూడా చర్చించినట్లు సమాచారం తెలుస్తుంది. విజయవాడ ఎంపీ సీటు బీజేపీ అడగడంతో టీడీపీ నో చెప్పినట్లు సమాచారం తెలుస్తుంది. అరకు, విశాఖ, రాజమండ్రి, నర్సాపురం లేదా ఏలూరు, రాజంపేట ఇంకా హిందూపురం సీట్లు బీజేపీ అడిగినట్లు సమాచారం అందుతుంది. బీజేపీ ప్రపోజల్స్ లో ఉన్న విశాఖ లేదా రాజమండ్రిలో ఏదో ఒక్కటి మాత్రమే టీడీపీ ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది.ఇక జనసేన పార్టీకు మాత్రం బాలశౌరికి మచిలీపట్నం, పవన్‌ కోసం కాకినాడ దాదాపు కన్‌ఫాం అయినట్లు సమాచారం తెలుస్తుంది.ఇక అరకు నుంచి కొత్తపల్లి గీత, రాజమండ్రి- పురంధేశ్వరి, నర్సాపురం- రఘురామకృష్ణరాజుతో పాటు నరేంద్రవర్మ పేర్లను పరిశీలిస్తోంది బీజేపీ. ఇంకా అలాగే.. తిరుపతి- రత్నప్రభ లేదా నీహారిక, హిందూపురం- సత్యకుమార్, రాజంపేట- కిరణ్‌కుమార్‌రెడ్డిని బరిలో దింపే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక.. అనకాపల్లి, ఏలూరుపై క్లారిటీ అనేది లేకపోవడంతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: