చంద్రబాబు: నరహంతకుడి వైపా.. వీరనారి వైపా.. నిర్ణయం మీదే..!
బాబాయిని చంపిన ముద్దాయి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని మరి వైయస్సార్ సమాధి వద్ద జగన్ అబద్ధాలు చెబుతున్నారని.. తనకు న్యాయం చేయాలని సునిత తన దగ్గర కోరిందన్నట్లుగా చంద్రబాబు నాయుడు తెలియజేసినట్లు వెల్లడించారు.. ఈ విషయంపై ఇండియన్ హెరాల్డ్ కు వచ్చిన సమాచారం మేరకు చంద్రబాబు ఇలా మాట్లాడుతూ ఒక ఆడబిడ్డ ఆవేదన విన్నాను అందుకే ఆమెకు సపోర్టు చేస్తున్నాను..మీరు కూడా ఆమెకే సపోర్ట్ చేయండి ఈసారి జగన్ను ఓడిద్దామంటూ తెలుపుతున్నారు.
హత్య రాజకీయాలు ఎవరికి మంచిది కాదని.. అయితే నిన్నటి రోజున సీఎం జగన్ ఏమీ తెలియని అమాయకుడిలా మాట్లాడుతున్నారని చంద్రబాబు ఎద్దేవ చేశారు.. అలాగే ఈ రోజున మనం కదిరిలో ఉన్నాము పక్కనే పులివెందుల కూడా ఉన్నది.. ఆ గొడ్డలి వేటు వేస్తే కదిరికి వినిపిస్తుందా లేదా.? అంటూ వెల్లడించడమే కాకుండా గొడ్డలి కూడా ఇక్కడే తయారయ్యిందని కూడా చంద్రబాబు తనకు వార్తలు వినిపించాయని చెబుతున్నారు.
ఇండియన్ హెరాల్డ్ కు వచ్చిన సమాచారం ప్రకారం.. జగన్ నిన్నటి రోజున సభలో మాట్లాడుతూ.. తన బాబాయిని చంపింది ఎవరో దేవుడికి తెలుసు తాను ఎలాంటి తప్పు చేయలేదని తెలియజేశారు.. ఇదే విషయాన్ని చంద్రబాబు మాట్లాడుతూ తన బాబాయిని చంపిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే.. మిమ్మల్ని చంపేసి మీ కుటుంబం పైన ఆహత్యను మోపుతారంటూ.. ఎద్దేవో చేశారు.తండ్రి మరణం తర్వాత న్యాయం జరగాలని పోరాడుతున్న సునీతకు మంచి జరగాల అనే విషయంపై ప్రజలే తీర్పు చెప్పాలని తెలిపారు..
ఇండియన్ హెరాల్డ్ విశ్లేషణ.. మేరకు వివేకానంద కుమార్తె సునిత జగన్ కు సంబంధించి చంద్రబాబు దగ్గర కొన్ని సమాధానాలను చెప్పిందని అది విన్న తర్వాత చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారని సమాచారం.. ఇలాంటి ఘోరాలు చేసి మళ్లీ ఆ నేరాలు తమపై నెట్టుతున్నారంటూ చంద్రబాబు తెలియజేశారు.