ఎంత దారుణం: పవన్ కల్యాణ్ను బ్లేడ్లతో కోసేస్తున్నారా?
ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కదా అంటున్న పవన్ కల్యాణ్.. అందుకే భద్రత మరింత కట్టుదిట్టంగా ఉంటే బాగుంటుందని జాగ్రత్తలు తీసుకుంటున్నానని వివరించారు. పిఠాపురంలో 100 మందికి పైగా నాయకులు సోమవారం సాయంత్రం జనసేనలో చేరిన సందర్భంగా పవన్ కల్యాణ్ ఈ మాటలు చెప్పారు. పార్టీలోకి వచ్చిన వారందరికీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్ మీ కోసమే ఇక్కడికి వచ్చానని.. మీకు అందరికీ అందుబాటులో ఉంటానని అంటున్నారు.
తాను ప్పుడూ ఎవర్నీ, ఏదీ అభ్యర్థించనన్న పవన్ కల్యాణ్.. ఒక్క దేవుణ్నే అభ్యర్థిస్తానని... అదీ రెండుసార్లు మాత్రమే కోరుకున్నానని తెలిపారు. గతంలో మహబూబ్నగర్ నుంచి ఓ అభిమాని వచ్చాడని.. ఒక్క హిట్ ఇయ్యన్నా.. రోడ్లమీద తిరగలేకపోతున్నామన్నా.. హిట్ లేకపోతే చచ్చిపోతామన్నా అన్నాడని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నాడు. అభిమానుల కోసం హిట్ కోసం తాను ఒకసారి భగవంతుణ్ని కోరుకున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు.
భీమవరంలో ఓడిపోయిన తర్వాత.. జనసేన వాళ్లంతా నలిగిపోతుంటే.. తండ్రీ ఒక్కసారి విజయం అంటే ఏమిటో చూపించమని తాను కోరుకున్నానని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. అలా అడిగినందుకు పిఠాపురం వాళ్లు గెలిపిస్తామని పిలిచారని.. ఇక్కడి ప్రజలకు రుణపడి ఉంటానని పవన్ కల్యాణ్ అన్నారు.