ఏపీ : వైసీపీ కి షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా..!!
కూటమి లో అసంతృప్తిలో వున్న అభ్యర్థులను వైసీపీ అధిష్టానం తమ పార్టీలో చేర్చుకొని వారికీ సీట్లు కేటాయిస్తుంది. దీనితో వైసీపీ అసంతృప్తి వర్గం మరింత నిరాశలో ఉంది. దీనితో కొందరు నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా వైసీపీ పి. గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన చిట్టిబాబుకు ఈసారి టిక్కెట్ దక్కలేదు. దీంతో ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా తాను రాజీనామా చేస్తున్నానని చిట్టిబాబు తన రాజీనామా లేఖలో వెల్లడించారు.వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పి. గన్నవరం నుంచి కాంగ్రెస్ అభ్యర్తిగా పోటీ చేసే అవకాశాలున్నాయి. పి. గన్నవరం సీటు కోసం చివరి వరకూ ప్రయత్నించిన చిట్టిబాబు తనకు రాకపోవడంతో ఆయన కాంగ్రెస్ లో చేరి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.