ఓరినాయనో.. ఓకే కుటుంబంలో 350 మంది ఓటర్లు?
ఇంకోవైపు అధికారులు ఓటు హక్కు యొక్క ఆవశ్యకత గురించి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పిస్తూ.. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇక ఓటర్లకు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. సాధారణంగా ఒక ఇంట్లో ఎంత మంది ఓటర్లు ఉంటారు అంటే మహా అయితే ఒక నలుగురు లేదా ఐదుగురు ఓటర్లు ఉంటారు అని చెబుతారు ఎవరైనా ఒకవేళ అది ఉమ్మడి కుటుంబం అయితే ఒక 20, 30 ఓట్లు ఒకే కుటుంబంలో ఉండడం కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అలా కాదు ఏకంగా ఒక చిన్నపాటి గ్రామంలో ఉండే ఓట్లు అన్ని ఒకే కుటుంబంలో ఉన్నాయి.
ఓకే ఇంట్లో 350 ఓట్లు ఉండడం గమనార్హం. ఏప్రిల్ 19వ తేదీన అస్సాంలో తొలి విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సోనీట్ పూర్ జిల్లా పులో గురి నేపాలి ఫామ్ గ్రామంలో ఒకే ఇంట్లో 350 ఓట్లు ఉన్నాయి. దివంగత బహదూర్ తాప అనే వ్యక్తికి ఐదుగురు భార్యలు. అయితే ఆ భార్యల ద్వారా 12 మంది కొడుకులు, 9 మంది ఆడపిల్లలను ఉన్నారు. కోడళ్ళు, అల్లుళ్ళు, పిల్లలు, మనవళ్లు, ముని మనవళ్లతో కలిపి ఆ ఒక్క కుటుంబంలోనే జనాభా 1200 కు చేరింది. ఇక ఆ కుటుంబంలో ఓటు హక్కు కలిగి ఉన్నవారు 350 మంది ఉన్నారు అన్న విషయం ఇటీవల ఎన్నికల అధికారులు సైతం గుర్తించి షాక్ అయ్యారు. ఇక వీరందరూ కూడా అదే ఊరిలో ఏకంగా 300 ఇళ్లల్లో నివసిస్తూ ఉండడం గమనార్హం.