ఖమ్మం : కర్ణాటకకు చేరిన కాంగ్రెస్ పంచాయతీ?
దీంతో టికెట్ తమకే వస్తుంది అంటూ ఎంతో మంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ టికెట్ కేటాయింపు విషయంలో నెలరోజుల నుంచి కసరత్తు జరుగుతుండగా.. ఇక ఇప్పుడు ఈ కసరత్తు క్లైమాక్స్ కి చేరుకుంది అన్నది తెలుస్తోంది. టికెట్ కోసం పోటీ పడుతున్న ముగ్గురు మంత్రుల మధ్య ఏకాభిప్రాయం తెచ్చేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగిందట. ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కర్గే తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశం అయ్యారట.
ఇందులో భాగంగానే ఇక ఈ ఖమ్మం స్థానం పంచాయతీ కర్ణాటక వరకు వెళ్లడంతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా రంగంలోకి దిగి పొంగులేటి, భట్టితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ మెంబర్స్ ని పక్కన పెట్టాలని అధిష్టానం సూచించడంతో ఇక నాగేశ్వరరావు పేరును బట్టి విక్రమార్క, రఘురాం రెడ్డి పేరును పొంగులేటి ప్రపోస్ చేశారట. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రఘురాం రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో అధిష్టానం ఇప్పటికే అతని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై అటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఫోన్ చేసి ఖర్గే ఆయన నుంచి అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారట. ఫైనల్ గా రఘురాంరెడ్డిని ఖరారు చేశారని.. మరికొన్ని గంటల్లో ఇక ఇందుకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తోంది.