ఏపీ: కర్నూలులో చంద్రబాబు కీలక సభలు.. వారిని గెలిపించుకునేందుకేనా?
ఇక నెల్లూరు నుంచి సాయంత్రం చంద్రబాబు కౌతాలం చేరుకోనున్నారు. అక్కడే రాత్రికి బస చేయనున్నారు. నందికొట్కూరులో సోమవారం చంద్రబాబు కీలక పర్యటన చేయనున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి గిత్తా జయసూర్యను చంద్రబాబు ప్రకటించారు. అయితే వైసీపీ నుంచి బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి తరచూ చంద్రబాబు, ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు. ఆయన చెప్పిన అభ్యర్థినే వైసీపీ అధినేత జగన్ ఖరారు చేశారు. ఇక్కడ ఆయన ప్రాభవానికి చెక్ పెట్టేందుకే తమ అభ్యర్థి జయసూర్య తరుపున చంద్రబాబు ప్రచారానికి రానున్నారు. ఇక చంద్రబాబు పర్యటన వివరాలను నంద్యాల లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
కాగా చంద్రబాబు పర్యటనలో భాగమైన హెలిప్యాడ్ను పరిశీలించేందుకు డీఎస్పీతో సహా అల్లూరు గ్రామానికి వెళ్లారు. ఇక చంద్రబాబు పర్యటన వివరాలను మాండ్ర శివానందరెడ్డి మీడియాకు వివరించారు. హెలికాప్టర్లో సోమవారం సాయంత్రం 5 గంటలకు టీడీపీ చంద్రబాబు హెలికాప్టర్లో చేరుకుంటారని వెల్లడించారు. అనంతరం నందికొట్కూరులోని అల్లూరు సర్కిల్, కొత్త బస్టాండ్, పటేల్ సెంటర్ వరకు చంద్రబాబు రోడ్ షో సాగుతుందన్నారు. ఆ తర్వాత పటేల్ సెంటర్లో టీడీపీ బహిరంగ సభ ఉంటుందన్నారు. ఇవి పూర్తైన తర్వాత అల్లూరులో రాత్రికి బస చేస్తారని వివరించారు. రాయలసీమలో టీడీపీ బలంగా ఉందని ఆయన చెప్పారు. చంద్రబాబు పర్యటనతో టీడీపీ మరింత బలోపేతం అవుతుందని, ఇక్కడ మెజారిటీ స్థానాలను గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.