ఏపీ: విజయవాడలో మోదీ రోడ్ షో.. ఈ వింత ప్లాన్ తెలిసి అందరూ షాక్..?
అయితే ఈ రోడ్డు షో ప్లాన్ చేయడం చాలా వింతగా అనిపిస్తోంది. ఎందుకంటే విజయవాడ సెంటర్లో బీజేపీ పార్టీ అసలు పోటీ చేయడం లేదు. మరి ఇక్కడ నుంచి రోడ్డు షో ప్లాన్ ఎందుకు చేశారు? అనేది అయోమయంగా మారింది. విజయవాడ వెస్ట్ నుంచి మాత్రమే బీజేపీ పోటీ చేస్తోంది. అలాంటప్పుడు బెంజ్ సర్కిల్లో రోడ్డు షో ప్రారంభించడం ఒక తెలివి తక్కువ నిర్ణయంగా కనిపిస్తోంది. వన్ టౌన్ నుంచి రోడ్డు షో ప్రారంభిస్తే బాగుండేది. అజిత్ సింగ్ నగర్ నుంచి బయలుదేరి ఫ్లైఓవర్ పైనుంచి ర్యాలీ జరిగినా పార్టీకి ప్రయోజనం ఉండేది. కానీ పోటీ చేయని చోట తిరగడం వల్ల ఎవరికీ ఉపయోగం లేకుండా పోతుంది.
గద్దె రామ్మోహన్ బోండా ఉమా పోటీ చేస్తున్న ప్రాంతంలో బీజేపీ అధినేత మోదీ ర్యాలీ చేయనున్నారు. మరి ఇలా చేయడం వల్ల బీజేపీ పార్టీకి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో దానిని ప్లాన్ చేసిన వారికే తెలియాలి. మోదీ ఈ విషయం గురించి తెలుసుకుంటే ఆయన కూడా కంగు తినే అవకాశం ఉంది. ఇకపోతే తెలంగాణలో ఆయన ఎప్పుడు తిరుగుతారనేది కూడా ఆసక్తికరంగా మారింది షెడ్యూల్ మాత్రం ఎనిమిది తొమ్మిదో తారీఖులలో ఉన్నట్లు చెబుతున్నారు. మే 13వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మోదీ ఈసారి పోల్చుకుంటే 100 సీట్లను కోల్పోయే అవకాశం ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.