యాంకర్ శ్యామల: పవన్ పై గెలుపు గీతక్కదే..!
పిఠాపురం ఎన్నికల పైన వంగా గీత అక్క గెలుపు ఖాయం అయ్యిందంటూ తెలియజేసింది. అంత ఇమేజ్ ఉన్న సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ మిగతా సినిమా వారిని తీసుకువచ్చి ఎందుకు ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా ఆమె ప్రశ్నించింది.. ఇక్కడ ఎవరికి బలం ఎంత ఉందో అంటూ తెలిసిపోతోంది కదా అంటూ తెలియజేస్తోంది శ్యామల.. వంగ గీత చాలా సీనియర్ నాయకురాలు ఆమెను ఓడించడం ఎవరి తరం కాదంటూ కూడా తెలియజేసింది.
వంగా గీత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎదిగారు అందరికీ తెలుసు అని.. ఆమెకు భారీ మెజార్టీ రావాలని మాత్రమే తాను ప్రచారం చేస్తున్నానంటోంది శ్యామల. అభివృద్ధి చేసిన వారికి ఓటు వేయండి.. అభివృద్ధి సీఎం జగన్ మోహన్ రెడ్డి, వంగా గీతా వల్లే పిఠాపురంలో సాధ్యమవుతుంది అంటూ తెలియజేస్తోంది శ్యామల. అటు మెగా కుటుంబం, సినీ సెలబ్రిటీలు కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వాలంటూ టిడిపి నేతలు కూడా తెలియజేస్తున్నారు. మరి ఎవరు గెలుస్తారో చూడాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సింది...