ఏపీ : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కీలక వ్యాఖ్యలు..!!
తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ చేస్తున్న ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు.. వ్యవస్థల మీద నమ్మకం పోయేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని . ప్రభుత్వాధినేత భూములు మింగేస్తారు అని చెప్పడం దేనికి సంకేతం అని ఆయన ప్రశ్నించారు.అధికారంలోకి రావాలి అనుకునే వారు చేయాల్సిన విమర్శలు ఇవేనా అని నిలదీశారు.14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అని సజ్జల విమర్శించారు.భూ అక్రమాలకు చెక్ పెట్టేందుకే ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ తెచ్చినట్లు ఆయన వివరించారు.. అయితే అది ఇంకా గెజిట్ అవ్వలేదు.. చట్టం అమలు కాలేదు.. విధి విధానాలు ఖరారు చేయలేదు అప్పుడే మీరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు.ఎన్నికల కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు తగిన విధంగా బుద్ది చెబుతారని సజ్జల తెలిపారు..ఇలాంటి చట్టం తేవడం ఒక విప్లవాత్మక మార్పు అని ఆయన అన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ చేసింది టీడీపీ అని విమర్శించారు.
టీడీపీ ప్రభుత్వంలో వెబ్ ల్యాండ్ పేరుతో చంద్రబాబు భూముల అక్రమాలకు పాల్పడ్డారని సజ్జల ఆరోపించారు. వెబ్ ల్యాండ్ పోర్టల్లో మార్పులు చేసి ఎంతో మంది భూములను ఇబ్బందులలోకి నెట్టివేశారని.CRDA పరిధిలోని భూములను డీమ్డ్ మ్యూటేషన్ పేరుతో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. అలాగే అసైన్డ్ భూములను కూడా బలవంతంగా లాక్కున్నారని సజ్జల ఆరోపించారు..అలాగే పాస్ పుస్తకాలను డిజిటలైజ్ చేశామని ఆయన తెలిపారు...పాస్ పుస్తకాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోటో ఉంటే మీకు వచ్చిన నష్టం ఎంటని ఆయన ప్రశ్నించారు.రాష్ట్ర ప్రజలకు లేని సమస్య చంద్రబాబుకు మాత్రమే వచ్చిందా అని సజ్జల ప్రశ్నించారు..