ఏపీ ఎలక్షన్స్ 2024 : ఈ సారి అధికారం ఆ పార్టీదే.. తెల్చేసిన ఆత్మ సాక్షి సర్వే..?
ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి,సంక్షేమం కావాలంటే కూటమి కి ఓటు వేయాలని చంద్రబాబు, పవన్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. అలాగే ప్రతిపక్ష కూటమిని నమ్మి మరోసారి మోసపోవద్దు అంటూ జగన్ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇరు పార్టీలలో ఈ సారి అధికారం ఎవరికీ దక్కనుందో తాజాగా ఆత్మ సాక్షి సర్వే తేల్చేసింది.ఆత్మసాక్షి సంస్థ తాజాగా 6 వ రౌండ్ సర్వే జరిపింది. ఈ సర్వే గత నెల 24 నుంచి మే 4 వరకు కొనసాగినట్లు వారు తెలిపారు.. తాజాగా వారు నిర్వహించిన సర్వే ప్రకారం ఈ సారి అధికార వైసీపీకి 48.5 శాతం ఓటు షేర్ రానున్నట్లు తెలిపింది. అలాగే ఉమ్మడి కూటమికి 46 శాతం, ఇతరులు 2 శాతం ఓటింగ్ షేర్ పొందనున్నట్లు తెలిపింది. ఇక వైసీపీకి 95 నుండి 113 సీట్లు రావొచ్చని అలాగే ఉమ్మడి కూటమి 56 నుండి 62 సీట్ల వరకు గెలవచ్చని ఈ సంస్థ అంచనా వేసింది..రాష్ట్రం లో మరోసారి వైసీపీ అధికారం లోకి రాబోతుందని ఆత్మసాక్షి సర్వే తేల్చింది. అయితే గతంలో పోల్చుకుంటే వైసీపీ గ్రాఫ్ కాస్త తగ్గినట్లుగా ఈ సర్వే తెలిపింది.