ఉత్తరాంధ్ర పోలింగ్.. ఫ్యాన్ గాలి ఊపేస్తోందిగా...!
ముఖ్యంగా ఉత్తరాంధ్ర లో అయితే ఓటర్ల సందడి మాములుగా లేదు. చాలా హోరా హోరీగా పోలింగ్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా వైసీపీకి ఎక్కువ ఓట్లు పోల్ అవుతున్నాయని అక్కడ ఓట్లు వేస్తున్న జనాల నుంచి ఇండియా హెరాల్డ్ ప్రతినిధులకు సమాచారం తెలుస్తుంది. ఉత్తరాంధ్రలో ఫ్యాన్ గాలి బాగా వీస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి వంటి ఏరియాల్లో జనాలు టీడీపీ కూటమి కంటే వైసీపీ వైపే మొగ్గు చూపుతూ ఓట్లు వేస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది.ఈసారి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ సీట్లలో కేవలం శ్రీకాకుళంలో మాత్రమే టీడీపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల అంతగా లేవు. కనీసం ఎంపీ సీట్లలో కూడా గెలవడం టీడీపీకి కష్టంగా ఉంది. అందుకే విజయనగరం, విశాఖలో టీడీపీ కంటే వైసీపీకే ఎక్కువ ఓట్లు పోల్ అవుతున్నట్లు సమాచారం తెలుస్తుంది. జగన్ మోహన్ రెడ్డి ఇంకా ఆయన పార్టీ నేతల వాగ్దానాలు ఇంకా గతంలో జనాలకు చేసిన మంచి పనుల వల్ల వైసీపీకి ఉత్తరాంధ్రాలో జనాలు బ్రహ్మరథం పడుతూ ఓట్లు వేస్తున్నారు. ఈ ఓట్లతో ఉత్తరాంధ్రాలో ఖచ్చితంగా వైసీపీ భారీ మెజారిటీతో గెలవడం పక్కా అని తెలుస్తుంది.