జగన్: రెండవసారి ప్రమాణ స్వీకారం.. ముహూర్తాన్ని ఫిక్స్ చేసిన వై.వి.సుబ్బారెడ్డి..!
ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి 150 సీట్లు మెజారిటీతో గెలుస్తుందని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. జగన్ చెప్పినట్టుగానే విశాఖలో వచ్చే నెలలో 9వ తేదీ ఉదయం 9:30 నిమిషాలకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈనెల 13వ తేదీన పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు, గిరిజనులు ,మైనార్టీ వారు వైసీపీ పార్టీకి ఓటు వేశారని తెలియజేశారు. తాజాగా సీఎం జగన్ కూడా తమకు గతంలో ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన 151యొక్క సీట్ల కంటే భారీ విజయం లభిస్తుందని తెలియజేశారు.
ఈ విషయాన్ని ఐ ప్యాక్ ఆఫీసులో వెల్లడించారు. వీటిని బట్టి చూస్తే వైసీపీ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా ఉన్నది.. ఆ పార్టీ నేతలు సైతం విజయం పైన ఎంత ధీమాగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు.. ప్రతిపక్ష నేతలు కూడా ఈసారి అధికారం తమ పార్టీదే అంటూ వెల్లడిస్తున్నారు.. ముఖ్యంగా బీజేపీ, జనసేన పార్టీలు తమకు అనుకూలంగా ఉన్నాయని అందుకే ఓటు శాతం పెరిగింది అనే విధంగా కూడా టిడిపి పార్టీ తెలియజేస్తోంది. మరి పూర్తి సమాచారం తెలియాలి అంటే వచ్చే నెల నాలుగవ తేదీ వరకు ఉండాల్సిందే..