టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణికి ఊహించని షాక్.. అసలు ఏమవుతుంది..?
గాజువాక నుంచి టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు పోటీ చేశారు. ప్రస్తుతం కూటమి నుంచి ఆయన పోటీ చేస్తుండడంతో విజయం ఖాయమనే ధీమాలో ఆయన వర్గీయులు ఉన్నారు. ఇక భర్త పోటీలో ఉండడంతో ఆయన భార్య లావణ్య దేవి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మే 4న భర్త తరుపున ఆమె ప్రచారం చేసి, టీడీపీ గుర్తు సైకిల్కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఆమె కోరారు. దీంతో ఆమెపై ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఎన్నికల సంఘం అధికారులకు వివరణ ఇచ్చారు. తాను కేవలం ఓ మహిళను కలిశానని ఆమె బదులిచ్చారు. ఈ వివరణకు ఎన్నికల సంఘం అధికారులు సంతృప్తి చెందలేదు. ఆమె ప్రభుత్వ ఉద్యోగి కావడంతో చర్యలకు సిద్ధమయ్యారు. ఏయూ రిజిస్ట్రార్కు ఎన్నికల రిటర్నింగ్ అధికారి లేఖ రాశారు. ఆమె తన భర్త తరుపున ప్రచారంలో పాల్గొన్నట్లు తేలడంతో ఏయూ రిజిస్ట్రార్ లావణ్య దేవిని సస్పెండ్ చేశారు. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు బహిరంగంగా కొన్ని పార్టీలకు అనుకూలంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే సొంత భర్త తరుపున పాల్గొన్నా నిబంధనలు ఉల్లంఘించినట్లే. దీంతో లావణ్య దేవికి అధికారులు షాక్ ఇచ్చారు.