తెలంగాణాలో మెజారిటీ బిజెపిదే.. కాంగ్రెస్ నేత రివ్యూ.. షాక్ లో హస్తం పార్టీ?
ఈ క్రమంలోనే ఎన్నికల పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఈసారి ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లలో ఉన్న రాజకీయ సమీకరణాల దృశ్య ఏ పార్టీ విజయం సాధించబోతుంది అనే విషయంపై ఎంతో మంది రాజకీయ విశ్లేషకులు కూడా రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే దిగ్గజ విశ్లేషకుడిగా పేరు సంపాదించుకున్న మాజీ శాసనసభ్యుడు కాంగ్రెస్ నేత గోనె ప్రకాష్ రావు ఇచ్చిన రివ్యూ కాస్త తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది ఈ పార్లమెంటు ఎన్నికల ఫలితాలలో ఆరు స్థానాలలో బిజెపి,ఐదు స్థానాలలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని గోనె ప్రకాష్ రావు చెప్పుకొచ్చారు.
బిజెపి 6, కాంగ్రెస్ ఐదు, ఎంఐఎం ఒకటి, ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లో టఫ్ ఫైట్ ఉంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇలా టఫ్ ఫైట్ ఉన్న ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా భువనగిరి, జహీరాబాద్, మహబూబ్నగర్లో బీజేపీ ఎడ్జ్ ఎక్కువ ఉంది అంటూ ఆయన రివ్యూ ఇచ్చారు. ఒక వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లో అటు కాంగ్రెస్కు ఎడ్జ్ ఉంది అంటూ తెలిపారు. అదిలాబాద్ లో బిజెపి, భువనగిరి బిజెపి- కాంగ్రెస్ మధ్య క్లోజ్ ఫైట్, చేవెళ్లలో బిజెపి, హైదరాబాద్ లో ఎంఐఎం, కరీంనగర్ లో బిజెపి, ఖమ్మంలో కాంగ్రెస్, మహబూబాబాద్ లో కాంగ్రెస్, మహబూబ్నగర్లో కాంగ్రెస్ - బిజెపి మధ్య ఫైట్, మల్కాజ్గిరి లో బిజెపి, నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్, నల్గొండలో కాంగ్రెస్, నిజాంబాద్ లో బిజెపి, పెద్దపల్లిలో కాంగ్రెస్,సికింద్రాబాద్లో బిజెపి, వరంగల్లో బిజెపి - కాంగ్రెస్ మధ్య ఫైట్, జహీరాబాద్ లో బీజేపీ - కాంగ్రెస్ ఫైట్, మెదక్ లో బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి మధ్య ఫైట్ ఉంటుందని తెలిపారు.