ఎన్టీఆర్ టార్గెట్.. టిడిపి భయపడుతోందా..?
కేవలం... హైదరాబాదులో మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా హైదరాబాదులో ఓటు వేశారు జూనియర్ ఎన్టీఆర్. ఆ సందర్భంగా బ్లూ కలర్ షర్టు వేసుకొని జూనియర్ ఎన్టీఆర్ రావడం కూడా పెద్ద వివాదంగా చూపింది తెలుగుదేశం సోషల్ మీడియా. వైసీపీకి మద్దతుగా బ్లూ కలర్ షర్ట్ వేసుకు వచ్చాడని జూనియర్ ఎన్టీఆర్ను టార్గెట్ చేసింది. ఇక ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ను వదలడం లేదు బుద్ధ వెంకన్న లాంటివారు.
జూనియర్ ఎన్టీఆర్కు అలాగే తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని... బుద్ధ వెంకన్న స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలోకి వస్తానన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ ను చేర్చుకోపోమని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. కొంతమంది తెలుగుదేశం సోషల్ మీడియా వారియర్స్... జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేసి మరి తిడుతున్నారు. అమ్మ నా బూతులు తింటున్నారు. వాస్తవానికి హీరోల మధ్య పోటీ ఉండాలి.... ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ తెలుగుదేశం అన్నట్లుగా వ్యవహారం మారిపోయింది.