కన్నీటి ఆంధ్రప్రదేశ్ : తిరుమల వెంకన్న జర పట్టించుకోండి ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యం ఆయన దేవాలయం తిరుమల శ్రీవారి సన్నిధి. ఈ తిరుమల సన్నిధికి... రోజుకు లక్షల్లోభక్తులు వస్తూ ఉంటారు. అలాగే తిరుమల శ్రీవారి ఆదాయం ఒక్క రోజులో నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు నమోదు అవుతూ ఉంటుంది. దేశంలోని నలుమూలల నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తారు. మరి అలాంటి తిరుమల శ్రీవారిని తెలుగుదేశం అలాగే వైసిపి ప్రభుత్వం అసలు పట్టించుకోలేదని చెబుతున్నారు.
మొన్నటి వరకు తెలుగుదేశం ఉన్న ఐదు సంవత్సరాల పాలనలో.. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తిరుమల శ్రీవారిని తెలుగుదేశం పార్టీ అసలు పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. అయితే మార్పు చేస్తామని ఆ తర్వాతపార్టీ అధికారంలోకి వచ్చింది. వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన కూడా తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎలాంటి మార్పు కనిపించలేదు.మార్పు కనిపించకపోవడమే కాకుండా... గత ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో.... తిరుమల శ్రీవారి భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారట. క్రైస్తవులకు తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉద్యోగాలు ఇప్పించారని వైసీపీ పై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా లడ్డు పరిమాణంలో.. భారీ మార్పులు చేసి... విమర్శలను మూటగట్టుకుని వైసిపి.
అంతేకాకుండా తిరుమల సన్నిధిలో ఉన్న పూజారుల విషయంలోనూ వైసీపీ... అత్యంత దారుణంగా ప్రవర్తించింది అని చెబుతున్నారు. భక్తులకు కనీస అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితిలో వైసిపి ప్రభుత్వం ఉందని ఇప్పటికే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఫ్రీగా పెట్టే భోజనంలో కూడా... దొడ్డు రైస్ పెడుతున్నారని భక్తులు నిత్యం ఫైర్ అవుతూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు... తిరుమల ఉన్నాయి. ఘాటు రోడ్లు, చిరుతల భయం భక్తుల్లో స్పష్టంగా ఉంది. వీటన్నిటిని... తెలుగుదేశం లేదా వైసిపి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన... వాటిని వెంటనే పరిష్కరించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. టెక్స్టైల్స్ సిటీ సహా.. తిరుమల సమస్యలను పరిష్కరించాలంటున్నారు.