ఏపీలో 46 ఏళ్లు గా ఒకటే సెంటిమెంట్.. ఈసారి అధికారం ఆ పార్టీదే..!
ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు అదే జరుగుతూ వచ్చింది. భీమవరం, ఏలూరు, ఉంగుటూరు, పోలవరంలో 1978 లో కాంగ్రెస్, 1983 అండ్ 85లో టిడిపి, 1989లో కాంగ్రెస్, 1994 అండ్ 99లో టిడిపి, 2004 అండ్ 2009 లో కాంగ్రెస్, 2014లో టిడిపి, 2019లో వైసీపీ విజయం సాధించాయి. అధికారిక పీఠాన్ని దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు కూడా ఏ పార్టీ అయితే ఈ నాలుగు చోట్ల గలుస్తుందో ఆ పార్టీ అధినేత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు ఆ నాలుగు చోట్ల గెలిచిన పార్టీని అధికారంలోకి వచ్చింది. ఈ లెక్కను చూస్తే అదే సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అవుతుందా లేదా అనేది చూడాలంటే ఎన్నికల ఫలితాల వరకు వెయిట్ చేయాల్సిందే. ఏకంగా ఈ సెంటిమెంట్ 46 ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తుంది. ఎప్పుడూ కూడా ఈ అంచనా తార్ మార్ అయ్యిందే లేదు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఏ పార్టీ విజయం సాధిస్తే అదే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నాలుగు ప్రాంతాల్లో ఎక్కువ ఏ పార్టీ గెలిస్తే ఈసారి కూడా అదే పార్టీ అధికారంలోకి వస్తుందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.