ఆరా మస్తాన్ : ఆర్కే రోజా ఈ సారి ఘోర ఓటమిపాలు కానుంది..

murali krishna
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు ఎంతో ఉత్కంఠటతో ఎదురుచూస్తున్నారు.రాష్ట్రంలో  ఈ సారి ఏ పార్టీ అధికారంలోకి రాబోతున్నది అనేది చాలా ఆసక్తికరంగా మారింది.గెలుపుపై ఇరు పార్టీ నాయకులు ఎంతో ధీమాగా వున్నారు.గెలుపుపై ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ చాలా కాన్ఫిడెంట్ గా వున్నాయి..రెండోసారి అధికారంలోకి వస్తున్నామని ఆ పార్టీ నేతలు ఇప్పటికే సంబరాలకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.అలాగే ప్రతిపక్ష కూటమి పార్టీ అయిన టీడీపీ ఈసారి తమ విజయం ఖాయం అని చెప్తుంది.టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే ఈ సారీ అధికారం ఖాయమని ఆ పార్టీ నాయకులు ఎంతో ధీమాగా వున్నారు.. ఇదిలా ఉంటే నేడు దేశ వ్యాప్తంగా ఎన్నికలు ముగియడంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు సర్వే సంస్థలు తమ సర్వే ఫలితాలను విడుదల చేసింది.సర్వే ఫలితాలలో ఎన్నో సంవత్సరాల అనుభవం వున్న ఆరా మస్తాన్ సర్వే తన సర్వే ఫలితాలను విడుదల చేసింది. 

ఎగ్జిట్ పోల్స్ కోసం ప్రజలు ఉదయం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఎగ్జిట్ పోల్స్ తెలియడంతో ఈ సారి రాష్ట్రంలో ఎవరు గెలుస్తారో ప్రజలకు పూర్తి క్లారిటీ వచ్చింది.తాజాగా 
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..తాజాగా ఆరా మస్తాన్ సర్వే సంచలన విషయం తెలిపింది. ఈ సారి నగరి నియోజకవర్గంలో రోజా ఘోరంగా ఓడిపోనుందని తెలిపింది. ఈ సారి ఆమెకు డిపాజిట్స్ కూడా దక్కే అవకాశం లేదని ఆరా మస్తాన్ సర్వే తెలిపింది.అయితే ఈ సారి వైసీపీ అధికారంలోకి వస్తుంది అని ఆరామస్తాన్ సర్వే తెలిపింది.అది కూడా కేవలం 2 శాతం ఓటు పర్సంటేజ్ తేడాతో గెలుస్తుంది అని ఆరామస్తాన్ సర్వే తెలిపింది. రాష్ట్రంలో మహిళలు ఈ సారి వైసీపీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించినట్లుగా ఆరా మస్తాన్ సర్వే తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: