2024 ఎన్నికల కౌంటింగ్: అధికారులకి అత్యంత భయంకరమైన కౌంటింగ్?
•చరిత్రలో ఎన్నడూ లేనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న అధికారులు
జూన్ 4న అంటే రేపు మంగళవారం నాడు నిర్వహించే కౌంటింగ్ అనేది అధికారులకి ఇప్పటిదాకా జరిగిన కౌంటింగ్ల కంటే చాలా భయంకరమైనదిగా నిలుస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు ఒక రేంజ్ లో డెవలప్ అయింది. ఏ చిన్న సంఘటన జరిగినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అందుకే ఈ ఎన్నికల కౌంటింగ్ అధికారులని వణికిస్తుంది. ఏ చిన్న తేడా జరిగిన వారిదే పూర్తి బాధ్యత. ఎందుకంటే ఏదైన తప్పు జరిగితే క్షణాల్లో వైరల్ అయ్యే సోషల్ మీడియా కాలం ఇది. కచ్చితంగా అధికారులు జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. అలాగే రేపు జరగబోయే గొడవలు, కౌంటింగ్ ట్రిక్స్ దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ నిర్వహించే అధికారులు ముందుగానే భయపడి పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కౌంటింగ్ సిబ్బంది, అధికారులకు శిక్షణ ప్రక్రియను పూర్తి చేసింది. ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థుల తరఫున ప్రతినిధులుగా కౌంటింగ్ ఏజెంట్లను ఎంపిక చేసి.. వారికి శిక్షణని ఇచ్చాయి. కౌంటింగ్ రోజు కౌంటింగ్ హాలులో ఏజెంట్లు కచ్చితంగా పాటించాల్సిన నిబంధనలపై ఇప్పటికే ఈసీ మార్గదర్శకాలను విడుదల చేసింది.మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుండగా, ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 3, 4, 5 తేదీలు మూడు రోజులపాటు మద్యం దుకాణాలు చాలా స్ట్రిక్ట్ గా పూర్తిగా మూతపడనున్నాయి.