రాజమండ్రి రూరల్ బుచ్చయ్య చౌదరి ఆదిక్యం..!
ఇకపోతే 175 స్థానాలలో ఒక స్థానంలో ఇప్పుడు టిడిపి ఆధిక్యం లో ఉన్నట్టు తెలుస్తోంది.. ఇంకా ఫలితాలు వెలబడలేదు కాబట్టి ప్రస్తుతం అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదిక్యంలో ఉన్నట్లు సమాచారం. రాజమండ్రి రూరల్ చిన్నది కాబట్టి అక్కడ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు త్వరగా ముగిబోతోందని సమాచారం మరి కాసేపట్లో ఇక్కడ అధికారంలోకి ఎవరు రాబోతున్నారు అనే విషయం స్పష్టం అవుతుంది. తాజాగా అందుతున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే.. ప్రస్తుతం కూటమి టిడిపి ఆధిక్యంలో ఉన్నట్లు వెల్లడిస్తుండగా మిగతా రౌండ్లో ఎవరు ఆధిక్యంలోకి వస్తారు అన్నది తెలియాల్సి ఉంది.
ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత ఉత్కంఠ గా కొనసాగుతున్నాయి. ఈసారి ఎవరు గెలుస్తారనే కోణంలో ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తుండగా ఇప్పుడు ఒక్కొక్క సీటు ఫలితాలు వెలువడుతుండడంతో అటు ప్రజలలో ఇటు పోటీ చేసిన అభ్యర్థులలో కూడా టెన్షన్ తట్టుకోలేక చెమటలు పడుతున్నాయని చెప్పవచ్చు. మొత్తానికి అయితే టిడిపి ఆదిక్యంలో ఉండి ఖాతా ఓపెన్ చేసేసింది మరి పూర్తి వివరాలు వెలువడే వరకు ఎవరు గెలుపొందుతారు వేచి చూడాలి. మరి కాసేపట్లో ఈ రాజమండ్రి రూరల్ ఎవరి ఆధీనంలోకి వెళ్ళబోతుందో తెలియనుంది.