ఏపీ ఉద్యోగులు: బాబుకే సలాం.. జగన్ కి చుక్కలు..
ముఖ్యంగా ఉద్యోగస్తులంతా కూడా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ అంటే ఉద్యోగస్తులు వేసిన ఓట్లను లెక్కించగా చాలావరకు టిడిపికే సలాం కొట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వైసీపీ ఒక్క ఖాతా కూడా తెరవలేదు. మొత్తంగా చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రకారం టిడిపి ముందంజలో కొనసాగుతోంది. ఇప్పటికే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీరంతా కూడా మొదటి రెండు రౌండ్లలో ముందంజలో కొనసాగుతున్నారు. ఇక ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తూ తామే అధికారంలోకి వస్తామని అప్పుడే వీరంగం సృష్టిస్తూ ఉండడం గమనార్హం.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తొలి రెండు రౌండ్ లలో లో టిడిపి ఆదిక్యంలో ఉంది.. వైసీపీ తాజాగా ఒక ఖాతా మాత్రమే తెరిచినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు 30చోట్ల టిడిపి ఆధిక్యంలో ఉండగా.. కేవలం ఒక్కచోట మాత్రమే వైసిపి ఆధిక్యంలో కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఉద్యోగస్తులంతా ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు చంద్రబాబు నాయుడుకే సలాం కొట్టినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పులివెందుల , కావలిలో వైసిపి ఖాతా తెరిచినట్లు సమాచారం.