ఓటరు ఒపీనియన్ ని ఆపేదెవడ్రా.. ఒళ్లు దగ్గరపెట్టుకోండి నాయకులారా?
ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు తమ సమస్యలను తీర్చుకోవడానికి అధికారుల వద్దకు వెళ్తే పట్టినట్టు వ్యవహరించడమే ఇక్కడ ప్రధాన కారణమని చెప్పాలి.. అందుకే నాయకులు ఇకనుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తేనే ఓటర్లు మిమ్మల్ని ఆదరిస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇక తాము అధికారంలోకి వస్తే ఏమైనా చేయగలం అనే ధీమా వ్యక్తం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎన్నికలలో ఓటర్లు గద్దె దింపుతారు అనడానికి ఇది చక్కటి ఉదాహరణ.
ప్రస్తుతం తాజాగా వెలువడుతున్న ఫలితాలను బట్టి చూస్తే కూటమి 152 స్థానాలలో ఆదిక్యం చూపుతూ ముందంజలో ఉండగా.. వైసిపి కేవలం 23 స్థానాలలో ముందంజలో ఉంది.. విడివిడిగా చూసుకున్నట్లయితే టిడిపి 127 స్థానాలలో ముందంజలో ఉండగా.. బిజెపి 6, జనసేన 19 స్థానాలలో ఆదిక్యత జోరు చూపిస్తూ ముందుకు సాగుతున్నాయి.. మొత్తానికైతే ఓటర్ దెబ్బకు ఎంతటి వారైనా నేల కొరగాల్సిందే అనడానికి ఇది చక్కటి ఉదాహరణ అని చెప్పవచ్చు .. ఇక ఎవరూ కూడా ఓటర్ ఒపీనియన్ ని ఆపలేరు.. కాబట్టి నాయకులారా ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే నెక్స్ట్ అధికారంలో మీరే..