కేసిఆర్ ఇప్పుడేం చేస్తాడు.. అందరిలోనూ ఇదే ప్రశ్న?
ఎందుకంటే ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష హోదాకి వచ్చినప్పుడు నుంచి ఒకటి తర్వాత ఒకటి చావు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా గులాబీ పార్టీలో కీలక పదవులను అనుభవించిన నేతలు అందరూ కూడా ఏకంగా కారు గుర్తుని వదిలి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కొంతమంది బిజెపిలో చేరారు. దీంతో ఈ పార్లమెంటు ఎలక్షన్స్ లో నిలబెట్టడానికి అభ్యర్థులే పరిస్థితి బిఆర్ఎస్ పార్టీకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో అయిన గులాబీ పార్టీ సత్తా చాటుతుందని ఆ పార్టీ కార్యకర్తలు నేతలు బలంగా నమ్మారు.
కానీ ఊహించిన రీతిలో కార్ పార్టీ ఒక్క సీట్లో కూడా విజయాన్ని సాధించలేకపోయింది. ఒకప్పుడు వార్ వన్ సైడ్ అన్నట్లుగా కోరుకొనసాగించిన బిఆర్ఎస్ పార్టీకి ఇక ఇప్పుడు ప్రత్యర్ధులకు కనీస పోటీ ఇవ్వలేకపోతుంది. ఎన్నో చోట్ల ఏకంగా బిఆర్ఎస్ పార్టీకి కంచుకోటలు గా ఉన్న ప్రాంతాల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు జెండా ఎగురవేశాయ్. ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో చక్రం తిప్పుతామనే గులాబీ పార్టీ ఆశలు ప్రస్తుతం అడిఆశలుగా మారిపోయాయి. ప్రస్తుతం ఆ పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోగా.. ఇక ఇప్పుడు ఎంపీ సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదు. ఇక కంటోన్మెంట్ఉప ఎన్నికలు సిట్టింగ్ స్థానాన్ని కూడా కోల్పోయింది. దీంతో ఇక కెసిఆర్ ఏం చేయబోతున్నాడు అనే విషయంపైనే అందరి దృష్టి ఉంది అని చెప్పాలి.