అవనిగడ్డ : దివిసీమ గడ్డ పవన్ ఫ్యాన్స్ అడ్డా... బుద్ధ ప్రసాద్ కొట్టాడ్రా బంపర్ విక్టరీ..!
జగన్ చివర్లో మళ్ళీ సింహాద్రి రమేష్ ను అవనిగడ్డ అసెంబ్లీ బరిలో దింపి.. సింహాద్రి చంద్రశేఖర్ ను మచిలీపట్నం పార్లమెంటుకు పోటీ చేయించారు. గత ఎన్నికలకు ఇప్పటికీ ఇక్కడ జరిగిన మార్పు ఏంటంటే.. బుద్ధ ప్రసాద్ టీడీపీ నుంచి ఎన్నికలకు ముందు జనసేన కండువా కప్పుకుని ఆ పార్టీ తరఫున పోటీ చేయటం ఒక్కటే. నియోజకవర్గంలో కోడూరు, చల్లపల్లి, నాగాయలంక, అవనిగడ్డ , మోపిదేవి , ఘంటశాల మండలాలు ఉన్నాయి. నియోజకవర్గ రాజకీయాలను కాపులు బలంగా శాసిస్తారు. నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఏ పార్టీ తరఫున ఎవరు గెలిచిన కాపు సామాజిక వర్గాల నేతలే గెలుస్తూ వస్తున్నారు. కృష్ణా జిల్లాలోని జనసేన , పవన్ అభిమానులు .. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం అవనిగడ్డ కావడంతో.. ఇక్కడ కూటమి గెలుస్తుందన్న అంచనాలు ముందు నుంచి ఉన్నాయి.
అయితే బుద్ధ ప్రసాద్ ఎన్నికలకు ముందు జనసేనలో చేరి పోటీ చేయడంతో ఏం జరుగుతుందన్న సందేహం అయితే ముందు నుంచి ఉంది. ఈ రోజు జరిగిన కౌంటింగ్లో బుద్ధ ప్రసాద్ 45 + వేల భారీ మెజార్టీతో గెలిచి దివిసీమ గడ్డ పవన్ ఫ్యాన్స్, జనసేన అడ్డా అని సగర్వంగా ఫ్రూవ్ చేశారు.