నందిగామ : వైసీపీ బ్రదర్స్కు మైండ్ పోయేలా షాక్ ఇచ్చిన సౌమ్య... సూపర్ విక్టరీ..!
జగన్మోహన్రావు సోదరుడు అరుణ్ కుమార్ ముందు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ అవ్వటం.. ఆ వెంటనే ఎమ్మెల్సీ అవ్వటం.. చకచకా జరిగిపోయాయి. అన్నదమ్ములు ఇద్దరు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కావటంతో నియోజకవర్గంలో వారు ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. ఈ క్రమంలోనే వారిద్దరు ఒంటెద్దు పోకడలతో కొన్ని విమర్శలు సైతం ఎదుర్కొన్నారు. గత ఎన్నికలలో ఓడిన తంగిరాల సౌమ్య ఐదేళ్లపాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. పాత ప్రత్యర్దులే మళ్ళీ తలపడడంతో నందిగామలో పోటీ తీవ్రంగానే కనిపించింది. అయితే ఎన్నికలకు ముందు ఇక్కడ తెలుగుదేశం గెలుస్తుందని ఎక్కువ సర్వేలు వెల్లడించాయి.
వరుసగా ఆరు సార్లు గెలిచిన తన కంచుకోటలో తెలుగుదేశం ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఈ రోజు కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి దూసుకు పోయింది. సౌమ్యకు గతంలో ఎప్పుడూ లేనంతగా ఏకంగా 27 వేల ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది. మరోసారి నందిగామ తెలుగుదేశం పార్టీ కంచుకోట అని ఫ్రూవ్ అయ్యింది. ఇక సౌమ్య ఇది రెండో సారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. మొత్తానికి మొండి తోక సోదరులు ఇద్దరికి కూడా ఈ పరాజయం పెద్ద షాకే.