ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకమైన ప్రాంతం తాడికొండ నియోజకవర్గం అని చెప్పవచ్చు. అలాంటి తాడికొండ నియోజకవర్గం లో ఈసారి వైసీపీ, టిడిపి మధ్య రసవత్తరమైనటు వంటి పోటీ ఏర్పడింది. ఈ నియోజకవర్గం లో మొత్తం 2,50,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఆరు సార్లు, తెలుగుదేశం నాలుగు సార్లు, సిపిఐ, వైసీపీ ఒక్కోసారి విజయాన్ని సాధించింది. అయితే తాడికొండ లో రాష్ట్ర విభజన తర్వాత 2014 లో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. టిడిపి నుంచి తెనాలి శ్రావణ్ కుమార్, వైసీపీ అభ్యర్థి క్రిష్టినా కత్తెర పై గెలుపొందారు.
2019 లో ఇక్కడ ఉండవల్లి శ్రీదేవి వైసీపీ నుంచి పోటీ చేసింది. ఈమెకు ప్రత్యర్థి గా శ్రావణ్ కుమార్ బరి లో ఉన్నారు. 2019లో ఉండవల్లి శ్రీదేవి విజయం సాధించారు. ఇక 2024 ఎన్నికల విషయానికి వస్తే... ఈసారి వైసీపీ నుంచి మేకపాటి సుచరిత, టిడిపి నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ మరోసారి బరి లో ఉన్నారు. ఈ విధం గా ఇద్దరు బిగ్ లీడర్ల మధ్య ఏర్పడుతున్నటు వంటి ఈ ఫైట్ లో ఎవరికి ఎన్ని ఓట్లు రాబోతున్నాయి.. ఎవరు విజయం సాధించబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.
టిడిపి కూటమి నుంచి శ్రావణ్ కుమార్ బరి లో ఉన్నారు. సమీప అభ్యర్థిగా మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత బరి లో నిలిచారు. ఇద్దరు కీలక లీడర్ల మధ్య జరిగినటు వంటి హోరా హోరీ పోరులో మేకతోటి సుచరిత ని తాడికొండ ప్రజలు తరిమేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వైసిపి అభ్యర్థి శ్రావణ్ కుమార్ కు 39,606 ఓట్ల మెజారిటీ అందించారు. అలాగే సుచరిత కు 69 వేల 979 ఓట్లు వచ్చాయి. ఈ క్రమం లోనే సుచరిత పై sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">శ్రవణ్ కుమార్ 1,09,585 ఓట్లు సాధించి భారీ విజయాన్నందుకున్నారు.