ఏపీ రాష్ట్ర అభివృద్ధిపై మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వైసీపీ 11 సీట్లకే పరిమితం అయింది. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, నందమూరి బాలకృష్ణ భారీ మెజార్టీతో గెలుపొందారు. దాంతో వీరికి సామాన్యుల నుంచే కాకుండా సెలబ్రిటీల నుంచి కూడా భారీ ఎత్తున విషెస్ వస్తున్నాయి ఇప్పటికే అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు అంటే ఆగ్రహ హీరోలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ నందమూరి బాలకృష్ణ లకు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో మహేష్ బాబు కూడా చంద్రబాబుకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు.
"ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఘన విజయం సాధించిన చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు! మీ హయాంలో ఏపీ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, మీ పదవీకాలం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నా. అద్భుతమైన విజయాన్ని సాధించిన పవన్ కళ్యాణ్‌కు అభినందనలు. ప్రజలు మీపై ఉంచిన విశ్వాసానికి మీ విజయమే నిదర్శనం. ఏపీ ప్రజల కోసం మీ కలలను సాకారం చేసుకోవాలని ఆశిస్తున్నా మీ పదవీకాలం సక్సెస్ ఫుల్ గా సాగాలని కోరుకుంటున్నా." అని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు హయాంలో జరగాలని మహేష్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇకపోతే చంద్రబాబు గెలవడం వల్ల సినిమా ఇండస్ట్రీపై జగన్ పెట్టిన ఆంక్షలు తొలగిపోనున్నాయి. మొదటి వారంలో టికెట్ రేట్లను బాగా పెంచేసుకొని సినిమా బడ్జెట్ ను తిరిగి పొందే అవకాశం ఉంటుంది. విజయవాడలో కొత్త సినిమా స్టూడియో కూడా రావచ్చు. పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి చేసే అవకాశం ఉంది. ఈ ఐదేళ్లలో ఇండస్ట్రీకి కావాల్సిన సహాయ సహకారాలు అందించొచ్చు. ఇకపోతే దర్శక నిర్మాతలు కూడా చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: