టీడీపీ పార్టీకి కొడాలి నాని హెచ్చరికలు..!
అయితే ఈ హింసకాండపై కొడాలి నాని స్పందించారు. కౌంటింగ్ అనంతరం టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు వైసీపీ నేతలపై ఉద్దేశ పూర్వకంగా దాడులు చేస్తున్నారుఇల్లు, కార్లు ద్వంసం చేసి దాడులు చేస్తున్నారని ఆగ్రహించారు. వైసిపి నేతలను క్యాడర్ ను భయభ్రాంతులకు గురి చేసే విధంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ దాడులకు పోలీసులు దగ్గర ఉండి చేయిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్నారు.
టీడీపీ అల్లరి మూకల మీద పోలీసులు చర్యలు తీసుకోకపోవడం పై హైకోర్టులో కేసులు వేస్తామని హెచ్చరించారు. ప్రతి నియోజక వర్గానికి వెళ్లి దాడులకు గురైన వారి ఇళ్లకు వెళ్లి వారికి అండగా నిలుస్తామన్నారు. టీడీపీ, జన సేన రౌడీ మూకలు రెచ్చిపోయి మారణ హోమం చేస్తున్నాయని ఆగ్రహించారు. టీడీపీ నేతలు, డీజీపీ కేసులు పెట్టవద్దని పోలీసులకి ఆదేశాలు ఇచ్చారు.... యూపీ, బీహార్ మాదిరి హింసా రాష్ట్రంగా టీడీపీ మారుస్తోందని ఫైర్ అయ్యారు.
అరాచక మూకలను ఆపాలసిన పోలీసులు బెదిరిస్తున్నారని.. కౌంటింగ్ పూర్తి అవ్వక ముందే బందరు లో దాడులకు తెగ బడ్డారని నిప్పులు చెరిగారు. ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు చేయటం లేదన్నారు. టీడీపీ నేతలు పోలీసులను పతనావస్థకు తెచ్చారని ఆగ్రహించారు. బరితెగించి మరీ దాడులకు పాల్పడుతున్నారు... వైసీపీ వాళ్ళు కొడుతున్నారు అని మాట్లాడటం దారుణం అన్నారు.