ఏపీ: జగన్ పై వైసిపి మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలామందిని ఇబ్బందులకు గురిచేసింది అంటూ కాటసాని తెలియజేశారు. తాము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వద్దని చెప్పామని కానీ ఎవరు ఈ విషయాన్ని వినలేదని తెలిపారు. అందుకే వైసిపి ఓటమి కి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య కారణమని వెల్లడించారు. అంతేకాకుండా ఇసుక ,మద్యం వల్ల కూడా తాము ఓడిపోయామని ఒప్పుకున్నారు. రైతుల భూములను లాక్కుంటున్నారని ప్రచారం టిడిపి పెద్ద ఎత్తున చేసిందని వీటితో పాటు కొన్ని తప్పులు చేయడం వల్లే మేము ఓడిపోయామని వెల్లడించారు. అలాగే అధికారుల మాట కూడా వినివుంటే గెలిచే వాళ్ళమని తెలియజేశారు మాజీ మంత్రి కాటసాని..
లక్ష రూపాయలు రుణమాఫీ చొప్పమన్నా కూడా పరిస్థితి ఇలా ఉండేది కాదని వెల్లడించారు తాము నియోజకవర్గంలో అభివృద్ధి చేయడమే తప్పయితే తమని క్షమించాలని కూడా వెల్లడించారు..తాము ఎప్పటికీ ప్రజాక్షేత్రంలోనే ఉండి ప్రజల కోసమే పోరాడుతూ ఉంటామని మాజీ నేత కాటసాని తెలియజేశారు.తన నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ తమను ఓడించడం చాలా బాధాకరంగా ఉంది అంటూ వెల్లడించారు కానీ ప్రజల తీర్పును మాత్రం ఖచ్చితంగా ఆశీర్వదిస్తానంటూ తెలియజేశారు వైసిపి సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి.. ప్రస్తుతం ఈ నేత చేసిన వాక్యాలు సైతం వైరల్ గా మారుతున్నాయి.