ఏపీ: చిన్న పార్టీల ప్రభావమెంత..?
కేఏ పాల్:
ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు 2019లో నరసాపురం పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు. అక్కడ కేవలం 3,018 (0.28%) వరకు ఓట్లు సంపాదించుకున్నారు.2024 లో గాజువాక నుంచి అసెంబ్లి బరిలోకి దిగగా 1000 ఓట్లు పడ్డాయి. ఇక విశాఖ నుంచి ఎంపి స్థానానికి పోటీ చేయగా 7,696(0.55%) ఓట్లు పడ్డాయి..
బీసీవైపి:
2019 ఎన్నికలలో పుంగనూరు నుంచి జనసేన అభ్యర్థిగా బోడె రామచంద్ర యాదవ్ పోటీ చేశారు.. అక్కడ 16,452 (8.4%) వరకు ఓట్లు లభించాయి.2024 లో సొంతంగా బిసివైపి పార్టీని మొదలుపెట్టి రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను పరిశోధించారు.. పుంగనూరు మంగళూరు గిరి అసెంబ్లీ స్థానాలలో ఆయనే పోటీ చేయగా అక్కడ 4,559 ఓట్లు మాత్రమే వచ్చాయి. మంగళగిరిలో 373 ఓట్లు పడ్డాయి.
జెడి లక్ష్మీనారాయణ:
సిబిఐ అధికారిగా ఉంటూనే విఆర్ఎస్ తీసుకొని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జేడీ లక్ష్మీనారాయణ మొదట జనసేన పార్టీలో చేరారు..2019 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయగా..2,88,874 (23.3%) ఓట్లు పడ్డాయి. 2024 లో సొంతంగా పార్టీ స్థాపించి జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. ఈసారి కూడా విశాఖ నగర్ నుంచి పోటీ చేయగా 5,160 ఓట్లు వచ్చాయి.
న్యాయవాది జడ శ్రవణ్:
జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ రాష్ట్రవ్యాప్తంగా సామాజిక అంశాల పైన స్పందిస్తూ ఉంటారు. తన న్యాయవాది ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన ఈయన మంగళగిరి నుంచి పోటీ చేశారు కేవలం 416 ఓట్లు సంపాదించారు.