బాలయ్య: మంచి మనసు.. సలాం కొట్టాల్సిందే..!
ఐదేళ్లపాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించినప్పటికి.. వైసీపీ అధికారంలోకి రాగానే ఈ కార్యక్రమాన్ని వదిలేశారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో అన్న క్యాంటీన్లు తెరుచుకునేలా చేస్తున్నారు. ఈ విషయంలో అందరికంటే ముందుగా ఉన్నారు నందమూరి ఎమ్మెల్యే హీరో బాలకృష్ణ. నిన్నటి రోజున తన పుట్టినరోజు సందర్భంగా టిడిపి పార్టీ ఏర్పడినందుకు తన నియోజకవర్గ పరిధిలో మొట్టమొదటిగా అన్న క్యాంటీన్ సైతం మొదలుపెట్టారు. హిందూపురం నియోజకవర్గం నుంచి బాలకృష్ణ మూడుసార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. దీంతో నియోజవర్గ ప్రజలకు చాలా రుణపడి ఉండాలని తెలియజేస్తూ అన్న క్యాంటీన్ సైతం మొదలుపెట్టారు బాలయ్య.
బాలయ్య చేసిన పనికి చాలామంది సెలబ్రిటీలు నేతలు కార్యకర్తలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.. బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి మంచి పని చేసి ఎందరికో మేలు చేశారని కూడా తెలియజేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో అన్ని ప్రాంతాలలో కూడా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం ఈనెల 12వ తేదీన పూర్తి చేసిన వెంటనే అన్ని పనులను కూడా క్రమక్రమంగా చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఐదు రూపాయలకే భోజనం వల్ల చాలామంది పేద ప్రజలు కడుపునిండా అన్నం తింటున్నారు.