పవన్: ఎమ్మెల్యేల సమావేశంలో కీలక వ్యాఖ్యలు..!
ఏపీ ఎన్నికలలో టిడిపి పార్టీ కూటమిగా అధికారంలోకి రావడంలో పవన్ కళ్యాణ్ పాత చాలా కీలకమైందని కూడా చెప్పవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదంటూ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే పొత్తును ప్రకటించారు.. ఈ సమయంలోనే వైసీపీ పార్టీని రెండవసారి గెలవనివ్వకుండా చేయాలని అనుకున్న పవన్ కళ్యాణ్ అలాగే చేశారు. టిడిపి బిజెపి పార్టీలు కలవడంతో చాలా కీలకమైన పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత కూటమిగా ఏర్పడి ఎన్నికల ప్రచారంలో పలు వ్యాఖ్యలు కూడా చేస్తూ వైసిపి ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు.
అలా ఎన్నో రకాలుగా హామీలను ఇస్తూ..ప్రజలకి అండగా తను ఉంటానని ఎలాంటి విషయాన్నైనా సరే నెరవేర్చతములో ఉందంటూ తెలియజేశారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు కూడా చాలామంది సెలబ్రిటీలను నేతలను కూడా ప్రచారం చేయించారు. దాదాపుగా 70 వేలకు పైగా మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలు రుణపడి ఉంటానని కూడా పవన్ కళ్యాణ్ తెలియజేశారు దేశంలోనే పిఠాపురం ఎమ్మెల్యే చేసే పని చూసి అందరూ ఆశ్చర్యపోతారు అంటూ కూడా తెలియజేశారు. ఇదంతా ఇలా ఉంటే చంద్రబాబు క్యాబినెట్లో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ వ్యవహరించబోతున్నట్లు సమాచారం.