గ్రేట్.. సర్పంచ్ సీఎం అయ్యాడు?
మోహన్ చరణ్ మాంఝి 1972 జనవరి 6వ తేదీన ఒడిశా లోని కీయంజోర్ లో జన్మించారు. అయితే అతను షెడ్యూల్డ్ తెగకు చెందినవారు. కాగా డాక్టర్ ప్రియాంక మారాండిని వివాహం చేసుకున్నారు. 1997 - 2018 రాయికల్ గ్రామ సర్పంచిగా ఎన్నికై ఆయన రాజకీయ ప్రస్తానాన్ని మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత 2000 సంవత్సరంలో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే విజయాన్ని సాధించగలిగారు. ఆ తర్వాత మోహన్ చరణ్ ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చా కార్యదర్శిగా కూడా పనిచేశారు. తర్వాత ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ గా కూడా ఆయన సేవలు అందించారు.
అయితే కియోంజర్ నియోజకవర్గ నుంచి 2004, 2019, 2024 లోను ఆయన వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూనే వచ్చారు. ఒడిశాలో గిరిధర్ గమాంగ్, హేమానంద బిశ్వనాథ్ తర్వాత మూడవ ఆదివాసి సీఎంగా రికార్డు సృష్టించారు. ఇక ఎప్పుడూ 24 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత 2024లో ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు అక్కడి ప్రజలు ఇక ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాంఝిని ఎంపిక చేసింది బిజెపి ఈ క్రమంలోనే ఒక సీఎం ఇద్దరు డిప్యూటీ సీఎం ఫార్ములాను బీజేపీ ఒడిశాలో అమలు చేసింది. అయితే ఇలా సర్పంచ్ నుంచి సీఎం వరకు ఎదిగిన మోహన్ చరణ్ మాంఝి రాజకీయ ప్రస్థానం గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు.