చంద్రన్నకు పట్టాభిషేకం.. బాబు ప్రమాణస్వీకారంతో ఏపీలో నవశకం మొదలైందిగా!
వేలమంది అభిమానులతో పాటు పలువురు నేతలు కూడా ఇక్కడకు హాజరయ్యారు. విభజిత ఏపీ సీఎం గా బాధ్యతలు చేపట్టడం ఇది రెండవసారి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు తన పట్టుదలతో ఆంధ్రప్రదేశ్ ని సైతం అభివృద్ధి చేస్తానని ఇప్పటివరకు ఎన్నో రకాల ఇంటర్వ్యూలలో తెలియజేయడమే కాకుండా ప్రజల మధ్య కూడా హామీలను ఇచ్చారు. చంద్రబాబు నాయుడుకు ఈసారి పరిపాలన కత్తి మీద సాము లాంటిదని కూడా చెప్పవచ్చు.
ఎందుకంటే మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను సైతం నెరవేర్చాలి అంటే కత్తి మీద సాము లాంటిది.ముఖ్యంగా మహిళల పైన ఎక్కువగా హామీలను కురిపించారు చంద్రబాబు ఆ హామిలే తనను అధికార పట్టానికి దగ్గర చేశారని కూడా చెప్పవచ్చు. మరి ఆహామీలను నెరవేర్చి 2029 ఎన్నికలలో భాగంగా ప్రజలలో ఓటు అడగడానికి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే నారా లోకేష్ కూడా యువ గళం పాదయాత్రలో భాగంగా ఎన్నో హామీలను సైతం ప్రకటించారు. చంద్రబాబు విజయంలో కీలకమైన నేతగా పేరు పొందారు పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్ లేకపోతే కచ్చితంగా టిడిపి పార్టీకి ఇంతటి విజయం చేకూరేది కాదని కూడా చెప్పవచ్చు.