చంద్ర బాబు: ఈరోజే తొలి సంతకం.. వాటి మీదే..!
సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సచివాలయానికి వెళ్ళేందుకు రెండు మూడు రోజులు సమయం పడుతుందని భావించినప్పటికీ .. ఈ రోజున మంచి రోజు కావడం చేత 4:41 నిమిషాలకు చంద్రబాబు సచివాలయం చాంబర్ కు వెళ్ళబోతున్నారని తెలిసి.. అక్కడ ఉద్యోగ సంఘాలు రాజధాని రైతుల చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే ఎమ్మెల్యేలను కూడా కలవబోతున్నారట గత పాలకులు ఐదేళ్ల కాలంలో అమరావతిని పూర్తిగా వదిలేశారని ఇప్పుడు టిడిపి అధికారంలోకి రావడంతో రాజధాని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
చంద్రబాబు ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని అమరావతి రైతులు తమకు పూర్వ వైభవం వస్తుందని విధంగా ఎదురుచూస్తున్నారు.. అలాగే మెగా డీఎస్సీ పైన మొదటి సంతకం చేస్తారని చంద్రబాబు హామీ ఇచ్చారు. టిడిపి విజయానికి సహాయపడిన నాలుగు అంశాల పైన ఉన్నవాటిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పై రెండవ సంతకం.. అన్న క్యాంటీన్లను మూడవ సంతకం పెన్షన్ ని నాలుగు వేలకు పెంపు నాలుగవ సంతకం అలాగే స్కిల్ సెక్షన్స్ ప్రక్రియను కూడా చేపట్టడం వంటి వాటిపైన ఈ రోజు సంతకం పెట్టే ఎలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే తాను ఎన్నికలలో హామీలు ఇచ్చారో వాటిని కూడా అమలు చేసేలా చంద్రబాబు ముందుకు వెళ్లబోతున్నారు.