బాబుని ఏమీ అనకుండా జగన్ ని ఆపుతుందెవరు.. అసలేం జరుగుతుంది?
వైసీపీ క్యాడర్ మీద చాలా చోట్ల దాడులు జరుగుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. మరోవైపు వైసీపీకి ఆరాధ్య దైవం అయిన వైయస్సార్ విగ్రహాలను కూడా కూల్చేస్తూ ఉన్నారు. ఇంత జరుగుతున్న అటు జగన్ మాత్రం నోరు విప్పడం లేదు. న్యాయపోరాటం, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం అంటున్నారు తప్ప.. టిడిపిని టార్గెట్ చేస్తూ విమర్శించడం మాత్రం చేయడం లేదు. ఎంతసేపు ఎందుకు ఓడిపోయామో తెలియట్లేదు అంటున్నారు తప్ప చంద్రబాబును ఉద్దేశించి మాత్రం కామెంట్స్ చేయట్లేదు. అయితే 2014లో టిడిపి గెలిచి వైసిపి ఓడి పోయినప్పుడు జగన్ తీరు ఇలా లేదు. ఏకంగా మీడియా ముందుకు వచ్చి ఎంతో అగ్రెసివ్ గానే మాట్లాడారు.
కానీ ఎందుకు ఇప్పుడు జగన్ అలా మాట్లాడలేకపోతున్నారు అన్నది అందరిలో మెదులుతున్న ప్రశ్న. అయితే 2019లో వైసీపీ గెలిచినప్పుడు చంద్రబాబు ఊరుకోలేదు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని అందుకే గెలిచారు అంటూ విమర్శలు గుప్పించారు. కానీ ఇప్పుడు జగన్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు అయితే కొత్త ప్రభుత్వం కొలువు దీరి కొన్ని రోజులైన తర్వాత ఇచ్చిన హామీలను మరిచిందని కాస్త లేటుగా విమర్శలు చేద్దామని అనుకుంటున్నారేమో అని చర్చ జరుగుతుంది.