ఏపీ: 39 ఏళ్ల నిరీక్షణకు తెర.. మంత్రి పదవితో ఆ నియోజకవర్గ ప్రజలు ఖుషి..??
1994 ఎన్నికల్లో కేశవ్ తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 1999 ఎన్నికల్లో కేశవ్ ఓడిపోయినా టీడీపీ గెలిచింది. 2004, 2009లో మళ్లీ గెలిచినా, కాంగ్రెస్ అధికారంలో ఉండగా టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. 2014లో టీడీపీ గెలిచినా కేశవ్ ఓడిపోయారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ గెలుపొందడంతో గతంలో ఉన్న ట్రెండ్ను తుంగలో తొక్కి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
39 ఏళ్ల తర్వాత ఉరవకొండ నియోజకవర్గానికి మళ్లీ మంత్రి పదవి దక్కింది. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన గుర్రం నారాయణప్ప 1985లో మంత్రి అయ్యాక.. అప్పటి నుంచి మరెవరికీ అవకాశం రాలేదు. ఇన్నాళ్ల తర్వాత టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్కు కేబినెట్ స్థానం దక్కింది. దాంతో ఆ నియోజకవర్గ ప్రజలు సంతోషిస్తున్నారు. 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కేశవ్ మరో నాలుగుసార్లు గెలిచారు.