కేవలం నోటి దూల కారణంగానే ఓడిపోయిన వైసీపీ నేత.. ఎవరంటే..??
అయితే ఈ నీచమైన భాష మాట్లాడిన నేతలంతా ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వారిలో అభ్యంతరకరమైన భాష మాట్లాడుతూ చాలా మంది చేత తిట్టించుకున్న మాజీ మంత్రి anil KUMAR YADAV' target='_blank' title='అనిల్ కుమార్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. ఆయన నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలో లావు శ్రీకృష్ణదేవరాయలుపై 1,59,729 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనిల్ ఘోర పరాజయానికి నోటి దూలే పెద్ద కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అనిల్ స్పందిస్తూ.. తమ పాలనలో తప్పులుంటే ప్రజల నిర్ణయాన్ని అంగీకరించి ఆ తప్పులను సరిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.
ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అనిల్ అన్నారు. ఇప్పుడు ఆ హామీ ఏంటని ప్రశ్నించగా.. తన సవాల్ను ఎవరూ స్వీకరించలేదని యాదవ్ చాకచక్యంగా తప్పించుకున్నారు. మీరు ఛాలెంజ్ విసిరితే ఎవరైనా స్వీకరించాలి.. అప్పుడు సవాల్ని స్వీకరించలేదని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారని అనిల్ అన్నారు.
పవన్ కళ్యాణ్ గురించి యాదవ్ మాట్లాడుతూ, తాను పవన్ కళ్యాణ్ను అసెంబ్లీ గేటులోకి రానివ్వనని తాను ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. 2019లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ 2024లో గెలిచారని.. రాజకీయం ఓ సైకిల్ లాంటిదని, గెలుపు ఓటములు రెండూ ఉంటాయని ఉద్ఘాటించారు. అయితే ఇప్పుడు అనిల్ కుమార్ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి. చాలామంది ఇప్పటికైనా హుందాగా మాట్లాడటం నేర్చుకోమని ఆయనకు హితబోధ చేస్తున్నారు. anil KUMAR YADAV' target='_blank' title='అనిల్ కుమార్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో చూడాలి.