చంద్ర బాబు: సంతకాలపై పవన్ ట్వీట్ వైరల్..!
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ కూడా మొదలుపెట్టారని యువతలో నైపుణ్యాలు గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు స్కిల్ సెక్షన్ ని కూడా ఐదవ సంతకం చేశారని తెలియజేశారు పవన్ కళ్యాణ్.. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు లాగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన ముందుకు కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మొదటి అడుగులు పడ్డాయని పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
అలాగే మేనిఫెస్టోలో ప్రకటించిన వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా మొదలు పెడుతూ ముందుకు అడుగులు వేయబోతున్నట్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నారు. కీలకమైన పదవులలో కూడా అటు బిజెపి నేతలను జనసేన నేతలను టిడిపి నేతలను సైతం ఉంచడం జరిగింది. మరి రాబోయే రోజులలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల యోగ సంక్షేమాల కోసమే పాటుపడుతూ ఉంటానని తెలిపారు..అలాగె పిఠాపురం ప్రజలను కలిసేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని ఈనెల 20వ తేదీన అందరిని పలకరించడానికి సిద్ధం అంటూ తెలియజేశారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చేసిన సంతకాల పైన ఈ విధంగా ట్విట్ చేశారు.