వైసీపీ :పార్టీకి షాక్ విశాఖ నుంచి ఎంవీవీ, జీవీ లు జంప్..!
ఈ కారణంగానే గత గురువారం విశాఖ నుంచి పార్టీ రాజ్య సభ్యుడు అయిన ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా ఉన్న వైవి సుబ్బారెడ్డిని కూడా ఈయన కలవలేదట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం టిడిపి నుంచి తమను కాపాడమంటూ.. గత కొద్ది రోజుల నుండి ఎంవివి, జీవి సైతం హైదరాబాదులో ఉండే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ను సైతం కలుస్తూ ఉన్నారట. ఈ విషయం తెలుసుకున్న రమేష్ సైతం ఫోన్ చేసి అసలు విషయాన్ని కనుక్కోగా కంగారుగా వెళ్లి తనని కలిశారట. ముఖ్యంగా బీజేపీ నుంచి సీఎం రమేష్ ఎంపీగా గెలిచిన మొత్తం వ్యవహారాలన్నీ కూడా చంద్రబాబుతోనే డీల్ చేస్తున్నారు.
ఇప్పుడు జీవివి, జివీ పరిస్థితి పై సీఎం రమేష్ హామీ ఇవ్వకుండా మూడు నెలల తర్వాత కలుద్దామని చెప్పి పంపించారట. అలాగే టిడిపి పార్టీలో సన్నిహితంగా ఉన్న.. జనసేన కార్యక్రమాల్లో తూర్పుగా పాల్గొంటున్నటువంటి మరొక పారిశ్రామికవేత అయినటువంటి లింగమనేని రమేష్ ను కూడా కలిసి తమ పైన ఎలాంటి చర్యలు కేసులు ఉండకుండా చూసుకోవాలని రాయబారాలు పంపినట్లు సమాచారం. ఆయన నుంచి కూడా ఎలాంటి స్పష్టమైన ఆమె రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం విన్న వైసీపీ నేతలు ఒకసారిగా షాక్ గురవుతున్నారు.. మొదటి నుంచి పార్టీలో ఉన్న చాలా మంది నేతలను కాదని కేవలం డబ్బు కోసమే MVV, జివిలను విజయసాయిరెడ్డి సుబ్బారెడ్డి లో సైతం తీసుకువచ్చారని వీరికి తగిన శాస్తి జరిగిందని వైసిపి నేతలు తిట్టిపోస్తున్నారు.