ఏపీ : జగన్ కు సీన్ అర్ధమైనట్లుంది... అందుకే అలా..?
జగన్ ప్రభుత్వం లో పార్టీపై మంచి పట్టు సంపాదించుకొని తనేం చెప్పిన జగనే చెప్పినట్లుగా ఫీల్ అయ్యేవాడు.సజ్జల వల్లే అన్ని పదవులు రావడంతో అందరూ సజ్జలకు ఎక్కువగా టచ్లో ఉంటున్నారు.కానీ అప్పట్లో జగన్ దీన్ని గమనించిన కూడా గెలుపు తమదే అన్న ధీమాతో ఉన్న జగన్ కు అలాంటివేం కనబడలేదు. కానీ ఓటమి తర్వాత జరిగిన పరిణామాలు బేరీజు వేసుకున్న జగన్ కు ఇపుడు పిక్చర్ క్లియర్ గా కనబడుతుంది.ఈ కారణం గా ఆయనను దూరం పెట్టక పోయినా సమావేశాలకు పిలుస్తున్నారు కానీ మీడియా సమావేశాలకు దూరం గా ఉండాలని చెప్పినట్లున్నారు. అక్కడ ఎవరూ మాట్లాడకపోయినా పర్వాలేదని మధ్యలో ఎవరి ఇన్వాల్ల్వెమెంట్ అవసరం లేదని అన్నట్లు సమాచారం.అందుకే ఎమ్మెల్సీలు, ఎంపీలు , పార్టీ నేతలతో సమావేశాల తర్వాత ప్రెస్ నోట్లు విడుదల చేస్తున్నారు కానీ ఎవరూ మీడియాతో మాట్లాడటం లేదు.