రామ్మోహన్ నాయుడు : లోకేష్ అడిగిన వెంటనే చేస్తానన్న కేంద్ర మంత్రి..!
అసెంబ్లీ లాబీలో ఏపీ మంత్రి నారా లోకేష్ను కలిశారు. టీడీపీ యువనేతలు ఇరువురు ఆత్మీయ ఆలింగనం చేసుకుని పరస్పరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలోని పెండింగ్ విమానాశ్రయాల పై నారా లోకేష్ మంత్రి రామ్మోహన్ను ఆరా తీశారు. ఈ క్రమంలో పెండింగ్ విమానాశ్రయాలను రెండేళ్లలోపు పూర్తి చేస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.అయితే వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రామ్మోహన్ నాయుడ్ని లోకేష్ కోరారు.మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ద్వారా చాలా సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు.మరోవైపు ఈ నెల 24 న ఏపీ కేబినెట్ సమావేశం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక విషయాల గురించి చర్చించనున్నారు.
సభ అనంతరం మంత్రి రామ్మోహన్ ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడును శనివారం విజయ వాడలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా చంద్రబాబుకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభి నందించారు.