ఉచిత కరెంటు పై కీలక నిర్ణయం తీసుకున్న చంద్రన్న ప్రభుత్వం.. విధి విధానాలు ఇవే..!

Pulgam Srinivas
రైతులకు ఉచిత కరెంట్ అనే పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న సమయంలోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి అమలులోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత రాష్ట్రాలు విడిపోయిన కూడా రైతులకు ఉచిత కరెంటు అందుతూనే ఉంది. కాకపోతే ప్రభుత్వాలు మారిన కొద్దీ వాటి గంటలను పెంచుతూ వస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా కాలం నుండే ఉచిత కరెంటు రైతులకు అందుబాటులో ఉంది. తాజాగా జరిగిన అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన స్థానాలను దక్కించుకొని మళ్లీ అధికారంలోకి వచ్చిన విషయం మనకు తెలిసిందే. దానితో వీరు రైతులకు ఇచ్చే ఉచిత కరెంటుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఇక తాజాగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి తెలుగు దేశం ప్రభుత్వం రైతులకు ఇచ్చే ఉచిత కరెంటు విషయంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఏమిటి అనే విషయాలను చెప్పుకొచ్చారు. తాజాగా ఈయన మాట్లాడుతూ ... వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ సరఫరా విషయంలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలి అని ఆయన విద్యుత్ శాఖకు సూచించారు. అలాగే విద్యుత్ వినియోగదారుల కంప్లైంట్ పరిష్కారానికి అగ్ర ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఆయన సూచించారు. ఎక్కడైనా ఏదైనా కరెంటు సమస్య వచ్చింది అంటే వాటిని వెంటనే పరిష్కరించాలి.

వారికి వీలైనంత తొందరగా మళ్ళీ కరెంటు సేవలను అందించాలి అని ఆయన సూచించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న కరెంటు స్తంభాలను వెంటనే గుర్తించండి. అలాగే లూస్ గా ఉండి పడిపోయే స్థితికి వచ్చిన స్తంభాలను కూడా వెంటనే గుర్తించండి. ప్రమాదకరమైన ట్రాన్స్ ఫార్మర్ లు ఎక్కడెక్కడ ఉన్నాయి వెంటనే వాటిని గుర్తించండి. వాటి స్థానంలో కొత్తవి అమర్చండి. అని ఆయన సూచించారు. ఇలా 24 గంటల నాణ్యమైన కరెంట్ ను రైతులకు అందించేందుకు నిరంతరం కృషి చేయబోతున్నట్లు ఈయన ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: