బీజేపీ: చిన్నమ్మకు చెక్ పెడుతోంది ఎవరు..?
దీంతో మరో కొత్త ప్రచారం కూడా తెరపైకి వచ్చింది ఈమెను స్పీకర్గా ఎంపిక చేయడానికి ఇదంతా జరిగిందని వార్తలు వినిపించాయి. అయితే గత పది రోజులుగా ఈ ప్రచారం వినిపించినప్పటికీ సౌత్ ఇండియాకు ఈసారి ప్రాధాన్యత ఇస్తారని అందులో పురందేశ్వరి పేరు ఉంటుందనే విధంగా వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ఈమె స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె కావడంతో కేంద్ర మంత్రిగా పనిచేసే అనుభవం కూడా ఉందని అందరూ అనుకున్నారు.. కానీ ఐదేళ్లపాటు స్పీకర్ గా పనిచేసే అవకాశం ఓం బిర్లాకే అవకాశం లభించింది.
అయితే ఈమెకు పదవులు రాకుండా తెర వెనుక ఎవరో చక్రం తిప్పుతున్నారని విషయం ఇప్పుడు తెరమీదికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో బిజెపిలోనే ఆమెకు గిట్టని వారు ఉన్నారని ఇదంతా వారే చేస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.బిజెపి పెద్దలు మాత్రం పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన స్వచ్ఛమైన బిజెపి నేతలకే పదవులు ఇస్తున్నారు అనే విధంగా పదవులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి సేవలను కేవలం ఉపయోగించుకుంటున్నారని సమాచారం. ఇప్పుడు బిజెపికి సొంత మెజారిటీ లేనందు వల్ల పార్టీ బలంగా ఉండాలని ఆలోచనతోనే మొదటి నుంచి ఉన్నవారికి ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నట్లు సమాచారం. అలాగే తెలంగాణలో ఈటెల రాజేందర్ కి కూడా కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదు. కేవలం కిషన్ రెడ్డికి బండి సంజయ్ లకు మాత్రమే పదవులు ఇచ్చారు.