వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్ ?
వాస్తవానికి ఈ ఎన్నికల ఫలితాల కంటే ముందే... పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని అరెస్టు చేయాల్సి ఉండేది. ఎన్నికలు జరిగిన తర్వాత... మాచర్ల నియోజకవర్గంలో ఉన్న ఓ పోలింగ్ కేంద్రంలో... వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యానికి దిగాడు. అక్కడ ఉన్న అధికారులను బెదిరించి... ఈవీఎం బాక్స్ లను కూడా బద్దలు కొట్టారు. అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బెదిరించారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే దీనిపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఆదేశించింది. అయితే ఆ సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ పారిపోయారు. హైకోర్టులో పిటిషన్ కూడా వేసుకున్నారు. దీంతో ఎన్నికల ఫలితాలు అయిపోయే వరకు... పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకూడదని అప్పుడు హైకోర్టు ఓ పేర్కొంది. అయితే ఆ గడువు ఇప్పుడు పూర్తి కావడంతో... తాజాగా మళ్లీ అరెస్టు చేశారు.
ఈవీఎం ధ్వంసం చేసిన కేసుతో పాటు మరో మూడు కేసులు... పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై ఉన్నాయి. అయితే తనకు ముందస్తు బెయిల్ ను పొడిగించాలని కోరుతూ పిటీషన్ వేశారు పిన్నెల్లి. అయితే ఆ పిటిషన్ ఇవాళ హైకోర్టు విచారించింది. ఇందులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కి షాక్ తగిలింది. వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు తాజాగా.... పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.