జగన్ తో భేటీ పై.. అలాంటి వ్యాఖ్యలు చేసిన డీకే శివకుమార్..!
ఇప్పటికే జగన్ డీకే శివకుమార్తో ఒకసారి భేటీ అయ్యారని అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారాయి అంటూ పలువురు నేతలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. డీకే జగన్ భేటీ వార్తలు పైన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారడంతో ఈ విషయంపైన డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు.. జగన్ తో భేటీ వార్తలను ఆయన ఖండించారు.. మా ఇద్దరి మధ్య ఎలాంటి సమావేశాలు జరగలేదంటూ మేమిద్దరం భేటీ అయినట్లుగా కేవలం తప్పుడు వార్తలని ఎవరో సృష్టించి రాశారని తెలిపారు.
నేను జగన్ అసలు బేటి కాలేదని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఇలాంటి ప్రచారాన్ని నమ్మకండి అంటూ తెలిపారు.. డీకే రెస్పాండ్ కావడంతో ఈ భేటీ వార్తలకు ఒకసారిగా చెక్ పడిందని చెప్పవచ్చు. టిడిపి నేతలు కావాలని వైసిపి పార్టీ, కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేస్తారంటూ పలు రకాల చర్చలు కూడా జరుగుతున్నారనే విధంగా వైరల్ గా చేశారు. దీంతో తాను జగన్ తో భేటీ కాలేదని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు మరొకసారి ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.